Rakshana | ప్రచారానికి డుమ్మా కొట్టిన పాయల్

Payal Rajput Rakshana Movie - పాయల్ నటించిన సినిమా రక్షణ. ఆమె ప్రచారం చేయకుండానే ఈ సినిమా రిలీజ్ అవుతోంది.

Advertisement
Update:2024-06-06 22:09 IST

హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ నిర్మించిన చిత్రం ‘రక్షణ’. పాయల్ రాజ్‌పుత్ మెయిన్ లీడ్‌గా నటించిన ఈ చిత్రం రేపు రిలీజ్ అవుతోంది. ఇప్పటికే రక్షణ టీజర్, ట్రైలర్‌లు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి.

అంతా బాగానే ఉంది కానీ లీడ్ రోల్ పోషించిన పాయల్ రాజ్ పుత్ మాత్రం ప్రచారం చేయడం లేదు. దీనికి సంబంధించి ఓ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై దర్శక నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ స్పందించాడు. పాయల్ ప్రచారం లేకుండానే సినిమా రిలీజ్ అవుతోందని స్పష్టం చేశాడు.

"ఈ సినిమా షూటింగ్ మొత్తంగా 57 రోజులు జరిగింది. అందులో పాయల్ ది 47 రోజుల పాటు షూట్ జరిగింది. అగ్రిమెంట్ ప్రకారం ఆమె ప్రమోషన్స్‌కి రావాలి. ప్రమోషన్స్‌కి వచ్చాక బ్యాలెన్స్ అమౌంట్ 6 లక్షలు ఇస్తామని చెప్పాను. కానీ పాయల్ వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ సినిమాకు ఆమె మాత్రమే ముఖ్యం. నేను ఓ కొత్త దర్శక నిర్మాతని. నన్ను ఎవ్వరూ చూడరు. నా మాటలు ఎవ్వరూ వినరు. కాబట్టి ఆమె రావాల్సిందే అని ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేశాను. 20 లక్షలు ఇస్తే వర్చువల్‌గా ప్రమోట్ చేస్తారని ఆమె మేనేజర్ సౌరభ్ ధింగ్రా చెప్పారు."

ఇలా వివాదంపై స్పందించాడు ప్రణదీప్. పాయల్ ప్రమేయం లేకుండానే రిలీజ్ అవుతోంది రక్షణ సినిమా. నాలుగేళ్ల కిందటి ఈ సినిమాకు ప్రచారం చేయడానికి పాయల్ అంగీకరించలేదు.

Tags:    
Advertisement

Similar News

'అఖండ 2' షురూ