Nayanthara | పోస్టు పెట్టింది, డిలీట్ చేసింది

Nayanthara - తనపై విమర్శలు చేసిన ఓ డాక్టర్ పై ప్రతివిమర్శ చేసింది నయనతార. ఆ వెంటనే ఆ పోస్టును డిలీట్ చేసింది. ఇంతకీ ఏం జరిగింది?

Advertisement
Update:2024-07-31 09:56 IST

హీరోయిన్లు బ్యూటీ టిప్స్ ఇవ్వాలి. వైద్యులు ఆరోగ్య చిట్కాలు చెప్పాలి. హీరోయిన్లు హెల్త్ టిప్స్ చెబితే రివర్స్ అవుతుంది. మొన్నటికిమొన్న సమంత విషయంలో అదే జరిగింది. హైడ్రజన్ పెరాక్సైడ్ తో చేసే ఓ వైద్య విధానాన్ని తన సోషల్ మీడియాలో పెట్టి బాగుందని చెప్పిన సమంతపై ఓ వైద్యుడు విరుచుకుపడ్డాడు. జైళ్లో పెట్టాలంటూ వాదించాడు.

సరిగ్గా ఇలాంటి ట్రోలింగే ఇప్పుడు నయనతారపై కూడా నడిచింది. హైబిస్కస్ టీని, దాని ఆరోగ్య ప్రయోజనాలను మెచ్చుకుంటూ ఓ పోస్ట్ పెట్టింది నయనతార. మధుమేహం తగ్గడంతో పాటు, మొటిమల నివారణకు ది బెస్ట్ అని రాసుకొచ్చింది.

దీనిపై ఓ వైద్యుడు ఆమెను విమర్శించాడు. మందార టీ గురించి నయనతార ఇచ్చిన స్టేట్ మెంట్స్ కు శాస్త్రీయ ఆధారాలు లేవంటూ వాదించాడు. ప్రజల్ని తప్పుదోవ పట్టించినందుకు నయనతార క్షమాపణలు చెప్పాలని వాదించాడు.

అయితే సమంతలా నయనతార ఊరుకోలేదు. కనీసం వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. నేరుగా విరుచుకుపడింది. "తెలివితక్కువ వ్యక్తులతో వాదించకండి, వాళ్లు మిమ్మల్ని వాళ్ల స్థాయికి లాగేస్తారు. ఆపై మీపై విరుచుకుపడతారు" అంటూ పోస్ట్ పెట్టి గట్టిగా సమాధానమిచ్చింది.

సోషల్ మీడియాలో నయనతారకే ఎక్కువ మద్దతు దక్కింది. అయితే ఈ పోస్టు పెట్టిన కొద్దిసేపటికే నయనతార దాన్ని డిలీట్ చేసింది. 

Tags:    
Advertisement

Similar News