చంద్రబాబుతో మెగాస్టార్‌ చిరంజీవి భేటీ

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కు రూ.కోటి సాయం చెక్కు అందజేత

Advertisement
Update:2024-10-12 20:36 IST

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో మెగాస్టార్‌ చిరంజీవి శనివారం రాత్రి భేటీ అయ్యారు. హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్‌ లో గల చంద్రబాబు నివాసానికి వెళ్లిన మెగాస్టార్‌ ఆయనతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్ కు తన తరపున రూ.50 లక్షలు, రామ్‌ చరణ్‌ తరపున మరో రూ.50 లక్షల చెక్కులు అందజేశారు. వరదలతో అతలాకుతలం అయిన ఆంధ్రప్రదేశ్‌ ను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన చిరంజీవికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News

'అఖండ 2' షురూ