ఫ్లాట్‌గా ప్రారంభమై లాభాల్లోకి సూచీలు

అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య అప్రమత్తంగా వ్యవహరిస్తున్న మదుపర్లు;

Advertisement
Update:2025-03-19 10:29 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు లాభ-నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలు 86.67 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ ట్రూడ్‌ బ్యారెల్‌ 70.36 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 3,042 డాలర్ల మార్క్‌ను దాటి ట్రేడవుతున్నది.

ఉదయం 10.30 గంటల సమయంలో 173.31 పాయింట్లు పెరిగి 75474.57 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 11.45 పాయింట్లు పెరిగి 22845.75 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, జొమాటో, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్‌, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌మహీంద్రా, సన్‌ఫార్మా, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. 

Tags:    
Advertisement

Similar News