లాభాల్లో మార్కెట్‌ సూచీలు

మార్కెట్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 300 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 22,500 వద్ద ట్రేడింగ్‌;

Advertisement
Update:2025-03-13 11:26 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 300 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 22,500 వద్ద ట్రేడింగ్‌ మొదలుపెట్టింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 87.14 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 71.01 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,953.80 డాలర్ల వద్ద కదలాడుతున్నది.

ఉదయం 11.25 గంటలకు సెన్సెక్స్‌221.58 పాయింట్ల లాభంతో 74251.34 వద్ద.. నిఫ్టీ 22.30 పాయింట్లు పెరిగి 22492.80 వద్ద ఉన్నాయి.సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, భారతీయ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎంఅండ్‌ఎం, అదానీ పోర్ట్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మా, టాటా మోటార్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, మారుతీ సుజుకీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News