దేశీ మార్కెట్‌ సూచీల అప్రమత్తత

శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ సంకేతాల మధ్య ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు

Advertisement
Update:2024-10-11 11:04 IST

అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ సంకేతాల మధ్య దేశీ మార్కెట్‌ సూచీలు అప్రమత్తత పాటిస్తున్నాయి. దీంతో శుక్రవారం సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 81 పాయింట్ల నష్టంతో 81,432 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 22 పాయింట్లు లాభపడి 24,976 వద్ద కొనసాగుతున్నది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు పెరిగి 83.96గా కొనసాగుతున్నది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 79.09 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,658 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.

సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్‌ కొర్పొరేషన్‌, జజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, కోటక్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, సన్‌ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, రిలయన్స్‌, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. మరోవైపు వరుసగా లాభాల్లో దూసుకెళ్తున్న షాంగై కూడా నష్టాల్లో కొనసాగుతున్నది. 

Tags:    
Advertisement

Similar News