ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

ఈ ఘటనలో ఆయన కుమారుడు హెచ్‌ఎస్‌ శర్మ, ఆయన భార్య నాగసంధ్య, వీరి పిల్లలు కార్తీక్, అనుపమ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement
Update: 2024-06-27 15:02 GMT

కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలోని కొత్తపాలెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. అనంతపురం – గుంటూరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో గుంటూరు జిల్లా లక్ష్మీపురానికి చెందిన సోమసి బాలగంగాధర్‌ శర్మ (78), ఆయన భార్య యశోద (67), డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందిన బాల గంగాధర్‌ శర్మ తిరుమల తిరుపతి దేవస్థానం విశ్రాంత ఉద్యోగి.

ఈ ఘటనలో ఆయన కుమారుడు హెచ్‌ఎస్‌ శర్మ, ఆయన భార్య నాగసంధ్య, వీరి పిల్లలు కార్తీక్, అనుపమ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో శర్మ, అనుపమ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్టు పట్టణ సీఐ సాంబశివరావు వెల్లడించారు. వీరంతా కర్ణాటకలోని బళ్లారి నుంచి గుంటూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సీఐ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News