తిప్పరా మీసం.. నాగబాబు రెచ్చగొట్టింది ఎవర్ని..?

కూటమి గెలిచాక నాగబాబు మళ్లీ తన పాత పంథాలోకే వెళ్లారు. వైరి వర్గాలను రెచ్చగొడుతూ మీసం తిప్పే ఫొటోతో ట్వీట్ వేశారు.

Advertisement
Update:2024-06-07 17:39 IST

ఏపీ ఎన్నికల తర్వాత.. మనవాడు-పరాయివాడు అంటూ వివాదాస్పద ట్వీట్ వేసి కొన్నిరోజులు హడావిడి చేశారు నాగబాబు. ఆ తర్వాత ఎవరో గట్టిగా క్లాస్ తీసుకోవడంతో ఆ ట్వీట్ డిలీట్ చేసి సైలెంట్ అయ్యారు. ఇప్పుడు కూటమి గెలిచాక ఆయన మళ్లీ తన పాత పంథాలోకే వెళ్లారు. వైరి వర్గాలను రెచ్చగొడుతూ మీసం తిప్పే ఫొటోతో ట్వీట్ వేశారు నాగబాబు.


ఫొటో ఘాటు.. ట్వీట్ స్వీటు

మీసం తిప్పే తన ఫొటోతో వైరి వర్గాలను రెచ్చగొట్టిన నాగబాబు.. ట్వీట్ లో వాడిన పదాల్లో మాత్రం శాంతి మంత్రం పఠించారు.

"ఈ మీసం తిప్పింది 'జనసేనాని' 100% Strike Rate కొట్టాడని కాదు,

కూటమి అఖండ విజయం సాధించింది అని కాదు

ఈ ధర్మపోరాటం లో పోరాడి గెలిచిన ప్రతి ఆంధ్రుడి తరపున నేను గర్వంతో తిప్పుతున్నాను ఈ మీసం...!" అంటూ తనదైన శైలిలో ఆ ఫొటోకు వ్యాఖ్యానం జతచేశారు నాగబాబు.

వాస్తవానికి నాగబాబు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంది. కానీ పొత్తుల ఎత్తుల్లో ఆయనకు సీటు క్యాన్సిల్ అయింది. నాగబాబు పోటీ చేసి ఉంటే కూటమి వేవ్ లో కచ్చితంగా గెలిచేవారు అనే అంచనాలున్నాయి. చట్ట సభలకు వెళ్లే అవకాశం మిస్ అయినా.. ఆయనకు మంచి నామినేటెడ్ పోస్ట్ ఖాయం అనే వార్తలు వినపడుతున్నాయి. మొత్తమ్మీద నాగబాబు సుడి తిరిగింది. తమ్ముడితోనే ఉన్నందుకు ఆయనకు న్యాయం జరిగే అవకాశముంది. అంతా బాగానే ఉంది కానీ.. ఇప్పుడిలా మీసం తిప్పుతూ నాగబాబు ఎవర్ని టార్గెట్ చేశారనేది మాత్రం తేలాల్సి ఉంది. 

Tags:    
Advertisement

Similar News