ఏపీలో చెత్త పన్ను రద్దు: చంద్రబాబు

స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ ధ్యేయంగా ముందుకెళ్లాలన్న ఏపీ సీఎం

Advertisement
Update:2024-10-02 13:56 IST

నేటి నుంచి ఏపీలో చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమం ఆయన మాట్లాడుతూ.. ఎక్కడా చెత్త పన్ను వసూలు చేయవద్దని ఆదేశించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ ధ్యేయంగా ముందుకెళ్లాలన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలని సూచించారు. భవిష్యత్తులో రోడ్లపై చెత్త ఉండకూడదని సీఎం తెలిపారు.

మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతంతో ముందుకెళ్లారు. బానిసత్వం వద్దు స్వాతంత్య్రమే ముద్దు అని నినదించారు. 2014 అక్టోబర్‌ 2న స్వచ్ఛ భారత్‌కు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. దీనికి అందరం ఆయనకు అభినందనలు చెప్పాలి. నీతి ఆయోగ్‌లో స్వచ్ఛభారత్‌పై ఉప సంఘం ఏర్పాటు చేశారు. దీనికి నేను చైర్మన్‌గా ఉన్నాను. చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. రూ. 2 లక్షలకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాం. ఏపీని ఓడీఎఫ్‌ రాష్ట్రంగా మార్చాం.

రాష్ట్రంలో 2019లో వచ్చిన ప్రభుత్వం వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. రోడ్లపై 85 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్తకుప్పలుగా పేరుకుపోయింది. ఏడాదిలోపు చెత్త మొత్తం శుభ్రం చేయించాలని పురపాలక మంత్రి నారాయణను ఆదేశించాం. స్వచ్ఛ ఏపీ ధ్యేయంగా ముందుకెల్లాలి. 2029 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు.

Tags:    
Advertisement

Similar News