పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు

ముగ్గురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఇవాళ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.

Advertisement
Update:2024-09-26 18:01 IST

వైసీపీకి భారీ షాక్ తగిలింది. ముగ్గురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఇవాళ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు), సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట) కిలారు రోశయ్య (పొన్నూరు) కు పవన కండూవ కప్పి సాదరంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించారు.

ఏపీలో ఈ ఏడాదిలో జరిగిన సార్వత్రి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ ఊహించని విధంగా ఓటమి పాలైంది. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. ఈ క్రమంలో పలువురు పార్టీ నేతలు ఫ్యాన్ పార్టీని వీడి అధికార పార్టీలో చేరారు

Tags:    
Advertisement

Similar News