మీకు ‘గుండుకొట్టడం’ బెజవాడ నుంచే మొదలవుతుంది..

విజయవాడ ఎంపీ సీటు అమ్ముకున్న చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పడం విజయవాడ నుంచే ప్రారంభమవుతుందని ఆయన తేల్చిచెప్పారు.

Advertisement
Update: 2024-02-18 04:52 GMT

రానున్న ఎన్నికల్లో జిత్తులమారి పొత్తులతో ఎన్నికలకు వస్తున్న టీడీపీ ఆంధ్రాలోనూ గుండుసున్నా కాబోతోందని విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పష్టంచేశారు. తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయిన టీడీపీ రాజ్యసభలో సున్నా అయిందని ఆయన గుర్తుచేశారు. తెలంగాణలో 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి దారుణంగా ఓడిపోయి అక్కడా సున్నా అయిందని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు, టీడీపీకి విజయవాడ నుంచే గుండుకొట్టడం ప్రారంభమవుతుందని ఆయన ఆరోపించారు.

ఎన్టీఆర్‌ జిల్లా ముప్పాళ్లలో శనివారం ఎంపీ కేశినేని నాని విలేకరులతో మాట్లాడారు. విజయవాడ ఎంపీ సీటు అమ్ముకున్న చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పడం విజయవాడ నుంచే ప్రారంభమవుతుందని ఆయన తేల్చిచెప్పారు. దీనికి సిద్ధంగా ఉండాలని ఆయన బాబుకు సూచించారు. ఎన్నికల తర్వాత ఇదే జరుగుతుంది.. కాస్కో.. దీన్నే నీ డైరీలో రాస్కో.. అంటూ చంద్రబాబుకు కేశినేని నాని సవాల్‌ విసిరారు.

Tags:    
Advertisement

Similar News