తిరుమలలో ప్రమాణం చేసిన భూమన కరుణాకర్‌ రెడ్డి

శ్రీవారి ఆలయంలో టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి ప్రమాణం చేశారు. పుష్కరిణీలో పవిత్ర స్నానం చేసి అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించారు.

Advertisement
Update:2024-09-23 17:44 IST

తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. శ్రీవారి లడ్డూ కల్తీపై తాము ఏ తప్పు చేయలేదని పుష్కరిణీలో పవిత్ర స్నానం చేసి అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించారు. నేను గాని తప్పు చేసి ఉంటే.. నేను నా కుటుంబం సర్వ నాశనం అయిపోవాలని ప్రమాణం చేశారు. మహా మూర్తి శరణాగతి తండ్రి.. గత కొద్ది రోజులుగా నా మనసు కలత చెందుతోంది. సర్వ జగద్రక్షుడు క్షుద్ర రాజకీయాలు మాట్లాడటం నిషిద్ధం.

అపచారం. ఆలయంలో అత్యంత పవిత్రమైన ప్రసాదాలు, లడ్డు విషయంలో కళంకిత మైనది అని కలుషిత రాజకీయ మనష్కులు. అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను రాజకీయ మాట మాట్లాడలేదు గోవిందా..గోవిందా.. అంటూ కరూణాకరరెడ్డి దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో కరుణాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News