ఏపీలో కొత్త స‌బ్ డిస్ట్రిక్ట్‌లు.. - నోటిఫికేష‌న్ జారీ చేసిన ప్ర‌భుత్వం

AP New Sub Districts: కొత్తగా ఏర్పాటు చేసిన సబ్ డిస్ట్రిక్ట్‌ల‌లో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటవుతాయని ప్రభుత్వం పేర్కొంది. అలాగే కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌ల‌లోని రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని కూడా ఉత్తర్వుల్లో తెలియ‌జేసింది.

Advertisement
Update:2023-06-24 16:35 IST

ఏపీలో కొత్త స‌బ్ డిస్ట్రిక్ట్‌లు.. - నోటిఫికేష‌న్ జారీ చేసిన ప్ర‌భుత్వం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం రాష్ట్రంలోని నూత‌న‌ జిల్లాల్లో కొత్తగా స‌బ్ డిస్ట్రిక్ట్‌ల‌ను ఏర్పాటు చేస్తూ నోటిఫికేష‌న్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఇవి ఏర్పాటవుతాయి. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇచ్చింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు జిల్లాల్లో స‌బ్ డిస్ట్రిక్ట్‌లు ఏర్పాటు చేస్తూ ఈ నోటిఫికేష‌న్ జారీ చేసింది.

భూముల రీసర్వే అనంతరం పాలన పౌర సేవలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా చేపట్టడ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, స్టాంపులు - రిజిస్ట్రేషన్ల శాఖ తరపున నోటిఫికేషన్ జారీ అయ్యింది. తక్షణమే ఈ నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

కొత్తగా ఏర్పాటు చేసిన సబ్ డిస్ట్రిక్ట్‌ల‌లో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటవుతాయని ప్రభుత్వం పేర్కొంది. అలాగే కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌ల‌లోని రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని కూడా ఉత్తర్వుల్లో తెలియ‌జేసింది.

రిజిస్ట్రేషన్ల చట్టం 1908లోని సెక్షన్ 5 ప్రకారం ఈ కొత్త సబ్ డిస్ట్రిక్ట్ ల‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న గ్రామాలు ఇక నుంచి కొత్త సబ్ డిస్ట్రిక్ట్ పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ సేవల కోసం గ్రామ సచివాలయాల పరిధిని కూడా నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Tags:    
Advertisement

Similar News