మనసు మారిందా?... పవన్‌తో నటుడు అలీ సుధీర్ఘ భేటీ

నటుడు అలీ … జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. విజయవాడలో దాదాపు రెండు గంటల పాటు ఇద్దరు భేటీ అయ్యారు. సుధీర్ఘంగా చర్చలు జరిపారు. 30ఏళ్లుగా పవన్‌ కల్యాణ్‌తో సన్నిహితంగా ఉంటున్న అలీ ఇటీవలే వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈనెల 9న ఇచ్చాపురం వేదికగా వైసీపీలో చేరుతున్నట్టు ఇప్పటికే అలీ ప్రకటించారు. అయితే పవన్‌తో సుధీర్ఘ అనుబంధం ఉన్న అలీ… జనసేనలో చేరకుండా వైసీపీలో చేరేందుకు సిద్ధమవడం రాజకీయంగా చర్చకు దారి […]

Advertisement
Update: 2019-01-06 01:31 GMT

నటుడు అలీ … జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. విజయవాడలో దాదాపు రెండు గంటల పాటు ఇద్దరు భేటీ అయ్యారు. సుధీర్ఘంగా చర్చలు జరిపారు. 30ఏళ్లుగా పవన్‌ కల్యాణ్‌తో సన్నిహితంగా ఉంటున్న అలీ ఇటీవలే వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.

ఈనెల 9న ఇచ్చాపురం వేదికగా వైసీపీలో చేరుతున్నట్టు ఇప్పటికే అలీ ప్రకటించారు. అయితే పవన్‌తో సుధీర్ఘ అనుబంధం ఉన్న అలీ… జనసేనలో చేరకుండా వైసీపీలో చేరేందుకు సిద్ధమవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో పవన్‌తో అలీ భేటీ చర్చనీయాంశమైంది.

అలీని జనసేనలోకి పవన్‌ కల్యాణ్ ఆహ్వానించినట్టు సమాచారం. ఆలోచించి త్వరలోనే తన నిర్ణయం చెబుతానని అలీ వెల్లడించినట్టు చెబుతున్నారు. పవన్‌తో అలీ భేటీ మర్యాదపూర్వకంగానే జరిగిందని జనసేన అధికార ప్రతినిధి ముత్తంశెట్టి కృష్ణారావు మీడియాకు వెల్లడించారు.

రాజకీయంగా చర్చ జరిగిందా లేదా అన్నది తమకు సమాచారం లేదని అలీని అడిగితేనే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.

ఇప్పటికే వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించిన అలీ… పవన్‌తో భేటీ తర్వాత నిర్ణయాన్ని మార్చుకుంటారా లేదా అన్నది చూడాలి.

Tags:    
Advertisement

Similar News