అనిల్ బ్రాహ్మణుడే కదా జగన్....

జగన్‌, పవన్‌లు కుల రాజకీయాలు మానుకోవాలని సూచించారు అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. కులాన్ని నమ్ముకుంటే జగన్‌, పవన్‌లు చంక నాకిపోతారని వ్యాఖ్యానించాడు. కుల ప్రాతిపదికన ఓట్లు అడగడం సరికాదన్నారు. సంజీవరెడ్డి, చెన్నారెడ్డి, వైఎస్‌లు ప్రజాదరణ ఉంది కాబట్టే ముఖ్యమంత్రులు అయ్యారని… కులం మీద కాదని చెప్పాడు. రెడ్లు అయితే ఏమైనా కొమ్ములు ఉంటాయా అని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించాడు. మీ చెల్లి పెళ్లి చేసుకున్నది బ్రాహ్మణుడైన అనిల్‌నే కదా అని జగన్ […]

Advertisement
Update: 2018-12-27 22:27 GMT

జగన్‌, పవన్‌లు కుల రాజకీయాలు మానుకోవాలని సూచించారు అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. కులాన్ని నమ్ముకుంటే జగన్‌, పవన్‌లు చంక నాకిపోతారని వ్యాఖ్యానించాడు.

కుల ప్రాతిపదికన ఓట్లు అడగడం సరికాదన్నారు. సంజీవరెడ్డి, చెన్నారెడ్డి, వైఎస్‌లు ప్రజాదరణ ఉంది కాబట్టే ముఖ్యమంత్రులు అయ్యారని… కులం మీద కాదని చెప్పాడు.

రెడ్లు అయితే ఏమైనా కొమ్ములు ఉంటాయా అని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించాడు. మీ చెల్లి పెళ్లి చేసుకున్నది బ్రాహ్మణుడైన అనిల్‌నే కదా అని జగన్ ను ప్రశ్నించాడు. షర్మిలకు కుల పట్టింపు లేదు కాబట్టే…. బ్రాహ్మణుడిని పెళ్లి చేసుకుందని జేసీ చెప్పాడు.

అసలు జగన్‌ సత్తా ఏంది? ఆయన ముఖానికి ఉన్న విలువేంది అని జేసీ ప్రశ్నించాడు. కక్ష పూరితంగా వ్యవహరించే వ్యక్తి ప్రధానిగా ఉండడం దేశానికి మంచిది కాదన్నాడు. ఇప్పటికైనా ప్రధాని మోడీ పద్దతి మార్చుకుంటే భవిష్యత్తు బాగుంటుందని హెచ్చరించాడు. లేదంటే అది మోడీ ఖర్మ అని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించాడు.

Advertisement

Similar News