Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Saturday, September 13
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS

    జగన్‌ ఒక్క ప్రకటన చేస్తే రాజకీయం మారిపోతుంది

    By SarviJune 13, 20221 Min Read
    జగన్‌ ఒక్క ప్రకటన చేస్తే రాజకీయం మారిపోతుంది
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ స్టీల్, విభజన హామీల సాధనలో ఏపీ సీఎం జగన్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్రపతి ఎన్నికలను బహిష్కరించాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ సూచించారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వచ్చి హోదా సాధిస్తానని చెప్పిన జగన్‌.. ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. హోదా, పోలవరం నిధుల సాధనకు రాష్ట్రపతి ఎన్నికలు మంచి అవకాశం అన్నారు.

    విభజన హామీలను నెరవేర్చకపోతే మద్దతు ఇచ్చేది లేదని జగన్‌ ఒక్క ప్రకటన చేస్తే మొత్తం రాజకీయం మారిపోతుందన్నారు. జగన్‌ ఎన్‌డీఏలో భాగస్వామి కాదని, అందుకే దళితులు, మైనార్టీలు ఓట్లేశారని హర్షకుమార్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏకు వ్యతిరేకంగా ఓటేసే ధైర్యం లేకపోతే.. కనీసం ఎన్నికలకు దూరంగా ఉండాలన్నారు. అప్పుడు ఎన్‌డీఏ అభ్యర్థి ఓడిపోతారన్నారు. ఎన్‌డీఏకి 13 వేల ఎలక్ట్రోరల్ ఓట్లు తక్కువగా ఉన్నాయని, వైసీపీ దగ్గర ఉన్న 43 వేల ఎలక్ట్రోరల్ ఓట్ల మద్దతు లభించకపోతే ఎన్‌డీఏ అభ్యర్థి ఓడిపోవడం ఖాయమన్నారు. అలా కాకుండా తనపై కేసు ఉన్నాయి కాబట్టి ఆ పని చేయలేను అని జగన్ అంటే ఇక రాష్ట్రానికి న్యాయం జరిగే పరిస్థితి ఉండదన్నారు.

    విభజనకు కాంగ్రెస్‌ మాత్రమే కారణమంటున్న ఈ పార్టీలు కూడా ఆ సమయంలో విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చినవేనని గుర్తు చేశారు. విభజన సమయంలో నాటి యూపీఏ ప్రభుత్వం అనేక అంశాలను విభజన చట్టంలో చేర్చిందని.. వాటిని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. ఏపీకి కాంగ్రెస్ వల్ల కంటే బీజేపీ వల్లనే ఎక్కువ నష్టం జరిగిందన్నారు.

    AP CM Former Congress MP
    Previous Articleకేసీఆర్ చర్చల సారాంశం ఇదీ.. ఉండవల్లి ఏం చెప్పారంటే..?
    Next Article జస్టిస్ సత్యనారాయణపై అమరావతివాదుల పూలవర్షం
    Sarvi

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.