Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Saturday, September 20
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS

    అవివాహిత స్త్రీలు … సరోగసి ప్రయోజనాన్ని ఎందుకు పొందకూడదు?కేంద్రాన్ని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు

    By Telugu GlobalOctober 17, 20232 Mins Read
    అవివాహిత స్త్రీలు ... సరోగసి ప్రయోజనాన్ని ఎందుకు పొందకూడదు?కేంద్రాన్ని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    సరోగసి విధానంలో బిడ్డను పొందడానికి అవివాహితలు, ఒంటరి మహిళలు ఎందుకు అర్హులు కారు? అంటూ ఢిల్లీ హైకోర్టు కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చట్టబద్ధంగా సరోగసీ ద్వారా ప్రయోజనాన్ని పొందే అవకాశం ఒంటరి, అవివాహిత స్త్రీలకు ఎందుకు లేదో సమాధానం చెప్పాలని కోర్టు కేంద్రాన్ని కోరింది.

    ఢిల్లీ హైకోర్టు … సరోగసి పద్ధతిలో బిడ్డను పొందాలని ఆశిస్తున్న 44 సంవత్సరాల ఒంటరి అవివాహిత మహిళ కేసుని విచారిస్తున్న సమయంలో ఈ విమర్శలు చేసింది. సరోగసి చట్టంలో సెక్షన్ 2 (1) (ఎస్) ని ఆమె ఛాలెంజ్ చేస్తూ కేసు వేసింది. ఈ సెక్షన్ ప్రకారం తనవంటి ఒంటరి, అవివాహిత మహిళలు సరోగసి విధానంలో బిడ్డను పొందే అర్హత లేదు. విడాకులు పొందిన లేదా భర్త మరణించిన ఒంటరి మహిళలకు మాత్రమే తన అండాలను వినియోగించుకుని సరోగసి పద్ధతిలో పిల్లలను పొందే అవకాశం ఉంది. తన పిటీషన్లో ఆమె చట్టంలోని ఈ వివక్షని ఎత్తిచూపింది.

    ఈ కేసుని విచారించిన కోర్టు … సరోగసి (రెగ్యులేషన్) చట్టం 2021 ప్రకారం… బిడ్డకోసం సరోగసి పద్ధతిని ఆశ్రయిస్తున్న స్త్రీని … భర్తని కోల్పోయిన లేదా విడాకులు పొందిన మహిళ… అనే భావంతో మాత్రమే పరిగణనలోకి తీసుకోవటం గురించి ప్రశ్నిస్తూ పై వ్యాఖ్యలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ సారధ్యంలోని ధర్మాసనం ఈ అంశంపై మాట్లాడుతూ సరోగసి విధానంలో బిడ్డను పొందేందుకు వివాహ అర్హతతో సంబంధం ఏమిటని ప్రశ్నించింది. వివాహితులైనప్పటికీ విడాకులు పొందిన లేదా భర్త మరణించిన స్త్రీలకు సైతం వైవాహిక జీవితం ఉండదు… మరి వారు అర్హులైనప్పుడు ఒంటరి, అవివాహిత స్త్రీల పట్ల వివక్ష ఎందుకని ధర్మాసనం అడిగింది. కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ఈ అంశంపై తాను మార్గనిర్దేశకాలను కోరతానని చెప్పారు. నేషనల్ మెడికల్ కమిషన్ తరపున ఆమె కోర్టుకి హాజరయ్యారు.

    ఈ కేసుని వాదించిన మహిళ తరపు న్యాయవాది… భర్త మరణించిన లేదా విడాకులు తీసుకున్న స్త్రీలు తమ అండం ద్వారా మాత్రమే సరోగసి పద్ధతిని వినియోగించుకోవాలనే అంశాన్ని సైతం ఎత్తి చూపారు. తమ పిటీషనర్ గురించి చెబుతూ… ‘ఆ మహిళ వివాహం చేసుకోలేదు… ఇప్పుడు ఆమె తనకంటూ ఓ బిడ్డ కావాలని కోరుకుంటోంది. అయితే వయసురీత్యా ఆమె అండాలు బిడ్డకు జన్మనిచ్చేందుకు ఉపయోగకరంగా లేవు కనుక వైద్యుల సూచన మేరకు మరో స్త్రీ అండం ద్వారా సరోగసి పద్ధతిలో బిడ్డను పొందాలని ఆశిస్తున్నది. అయితే తన బిడ్డ జన్యుపరంగా తన కుటుంబానికి చెందినదిగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆమె సోదరుడి స్పెర్మ్ ని సరోగసి కోసం వినియోగించుకోవాలని అనుకుంటున్నది’ అంటూ కోర్టుకి వెల్లడించారు.

    తన పిటీషన్ ద్వారా అద్దెగర్భంతో సంతానం పొందడానికి అడ్డు వస్తున్న సరోగసి చట్టం 2021లోని నిబంధనలను ప్రశ్నించిన మహిళ… అండం పునరుత్పత్తికి అనువుగా ఉండటానికి, మహిళల వివాహ స్థితికి ఏ మాత్రం సంబంధం లేదని, ప్రభుత్వం పౌరుల పునరుత్పత్తికి సంబంధించిన హక్కులను నియంత్రించలేదని…కూడా తన పిటీషన్ లో పేర్కొన్నారు.

    ఒంటరి, అవివాహిత స్త్రీలపై సరోగసి విషయంలో విధించిన నిబంధనలు చాలా నిర్హేతుకంగా, అన్యాయంగా, వివక్షాపూరితంగా ఉన్నాయని, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు ఇవి విరుద్ధమని, ఆర్టికల్ 14 లోని సమానత్వ హక్కుకి, ఆర్టికల్ 21 లోని జీవించే హక్కుకి ఆ నిబంధనలు ఆటంకాలుగా ఉన్నాయని పిటీషనర్ తన పిటీషన్ లో వెల్లడించారు.

    సరోగసిలో బిడ్డని పొందాలంటే సదరు మహిళ వయసు 35నుండి 45 మధ్యలో ఉండాలనే నిబంధనపైన కూడా ఆమె తన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వయో పరిమితిని మెదడుతో ఆలోచించకుండా విధించారని, ఒక జంట సరోగసికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నపుడు స్త్రీ వయసు 23-50 సంవత్సరాల మధ్యలో ఉండటం సమంజసం అని కూడా ఆమె తమ పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ కేసు తిరిగి అక్టోబరు 31న కోర్టు విచారణకు రానుంది.

    delhi high court surrogacy
    Previous Articleనవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నారా? ఈ జాగ్రత్తలు ముఖ్యం!
    Next Article జీవనసాపేక్షం (కథ)
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.