Telugu Global
WOMEN

జాతీయ మహిళ కమిషన్‌ చైర్ పర్సన్‌ గా విజయ కిశోర్‌ రత్నాకర్‌

సభ్యురాలిగా అర్చన మజుందార్‌.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

జాతీయ మహిళ కమిషన్‌ చైర్ పర్సన్‌ గా విజయ కిశోర్‌ రత్నాకర్‌
X

జాతీయ మహిళ కమిషన్‌ చైర్‌ పర్సన్‌ గా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నాయకురాలు విజయ కిశోర్‌ రత్నాకర్‌ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ కు చెందిన విజయ మహిళ హక్కుల ఉద్యమంలో కీలకంగా పని చేశారు. బీజేపీలో ముఖ్య నాయకురాలు. త్వరలోనే మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్‌ మహిళా నాయకురాలికి కేంద్ర ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. ఆమె మూడేళ్ల పాటు లేదా.. 65 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెస్ట్‌ బెంగాల్‌ లోని నార్త్‌ 24 పరగణాల జిల్లాకు చెందిన డాక్టర్‌ అర్చన మజుందార్‌ ను మహిళా కమిషన్‌ సభ్యురాలిగా నియమించారు.





First Published:  19 Oct 2024 9:53 AM GMT
Next Story