Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Saturday, September 20
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Andhra Pradesh

    గవర్నర్ వద్దకు చేరిన ఏపీ మహిళా కమిషన్ వివాదం

    By Telugu GlobalJuly 12, 20241 Min Read
    గవర్నర్ వద్దకు చేరిన ఏపీ మహిళా కమిషన్ వివాదం
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    పేరుకి రాజ్యాంగబద్ధ వ్యవస్థలే అయినా అందులో నియామకాలు ఎలా జరుగుతాయో అందరికీ తెలుసు. ప్రభుత్వం మారగానే తమ వాళ్లు కాదు అనుకున్నవారిని పక్కకు తప్పిస్తారు, తమకు అనుకూలమైనవారిని అందలమెక్కిస్తారు. ఏపీలో కూడా కూటమి ప్రభుత్వం రాగానే టీటీడీ సహా ఇతర వ్యవస్థల చైర్మన్లు రాజీనామా చేసి పక్కకు తప్పుకున్నారు. కానీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి మాత్రం ససేమిరా అంటున్నారు. రాజీనామా చేయాలంటూ పరోక్షంగా ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ఈ వేధింపులకు భయపడేది లేదంటున్నారు చైర్ పర్సన్. తన పదవీకాలం 2026 మార్చి వరకు ఉందని ఆమె గుర్తు చేస్తున్నారు.

    కూటమి ప్రభుత్వం వచ్చినప్పటినుంచి మహిళా కమిషన్ చైర్ పర్సన్, సభ్యుల జీతాలు పెండింగ్ లో పెట్టారు. కనీసం టీఏ, డీఏలు కూడా ఇవ్వడంలేదు. ఆఫీస్ నిర్వహణ ఖర్చులు కూడా ఆపేయడంతో వివాదం మొదలైంది. మహిళా కమిషన్ చైర్ పర్సన్ ని కూడా ఇలా ఇబ్బంది పెడతారా అంటూ గజ్జల వెంకట లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇక మహిళలకు రక్షణ ఎక్కడుందని అంటున్నారు. గవర్నర్‌కు, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శికి ఆమె ఫిర్యాదు చేశారు.

    చైర్‌పర్సన్లు, సభ్యులు రాజీనామా చేసి వెళ్లిపోతే, ఆ స్థానాల్లో తమ వారికి పదవులు కట్టబెట్టేందుకు కొత్త ప్రభుత్వం ఎదురు చూస్తోంది. వాస్తవానికి ప్రభుత్వాలు మారిన తర్వాత ఇలాంటి పదవుల్లో ఉన్నవారు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి వెళ్లిపోతారు, కొంతమంది కొత్త ప్రభుత్వం అండదండలతో కొనసాగుతారు. కాదు, కుదరదు అన్నవారిపై వేటువేయడానికి ప్రభుత్వం వెనకాడదు. కానీ తొలగింపు అంత ఆషామాషీ కాదు. అందుకే ప్రభుత్వం వారిపై రాజీనామా ఒత్తిడి చేస్తోంది. కానీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ మాత్రం ఆ ఒత్తిడికి తలొగ్గేది లేదంటున్నారు. దీంతో వివాదం మొదలైంది. ఈ పంచాయితీ గవర్నర్ వద్దకు చేరింది. 

    ap women commission women commission
    Previous ArticleVenkatesh | వెంకీ సినిమా మొదలైంది
    Next Article చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్.. 30రోజుల్లో ఏమేం చేశారంటే..?
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.