Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Wednesday, September 10
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Crime

    ప్రొఫెసర్‌ సాయిబాబాను నిర్బంధించిన వారిని శిక్షించాలి

    By Naveen KameraOctober 21, 20242 Mins Read
    ప్రొఫెసర్‌ సాయిబాబాను నిర్బంధించిన వారిని శిక్షించాలి
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబాను అక్రమంగా పదేళ్ల పాటు నాగ్‌పూర్‌ జైళ్లోని అండాసెల్‌ లో నిర్బంధించిన కేంద్ర, రాష్ట్ర పాలకులు, పోలీస్‌ అధికారులను శిక్షించాలని వక్తలు డిమాండ్‌ చేశారు. సోమవారం బాగ్‌ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞన కేంద్రంలో నిర్వహించిన ప్రొఫెసర్‌ సాయిబాబా సంతాప సభలో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శలు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, వీక్షణం వేణుగోపాల్‌, ప్రొఫెసర్‌ జి. లక్ష్మణ్‌ తదితరులు ప్రసంగించారు. సాయిబాబా నిర్దోశి అని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని, అలాంటప్పుడు ఆయనను అక్రమంగా జైళ్లో నిర్బంధించిన వారికి ఎలాంటి శిక్షలు వేస్తారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో న్యాయ వ్యవస్థ, చట్టాలు, రాజ్యాంగం లేవా.., పాలకులు తమ ఇష్టానుసారంగా అరెస్టు చేసి 10 ఏళ్ల పాటు జైల్లో నిర్భంధిస్తారా అన్ని ప్రశ్నించారు. చట్టాల లోపంతో సాయిబాబాను జైళ్లో నిర్బంధించారా లేక పాలకుల్లో మొదళ్లలో విషం నిండి ఈ పని చేశారా అని తేల్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏ నేరం చేయని వారిని ఏళ్ల తరబడి జైళ్లలో నిర్భంధించే ఈ చట్టాలు ఉంటే ఎంత? లేకపోతే ఎంత? అని మండిపడ్డారు. బెయిల్ అనేది రూల్ అపి నేరం రుజువైతేనే జైలు అని ప్రఖ్యాత న్యాయ కోవిదులు జస్టిస్ వి.ఆర్ కృష్ణ అయ్యర్ వ్యాఖ్యలను చేశారు. మావోయిస్టులను తుదముట్టిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న కేంద్ర పాలకులు ఒక పౌర హక్కుల ఉద్యమకారుడి సంస్మరణ సభకు స్వచ్ఛందంగా ఎంత మంది వచ్చారో చూడాలన్నారు.

    నేరస్తులు ఎన్నికల్లో గెలిచి దేశాన్ని పాలిస్తున్నారని అన్నారు. గుజరాత్‌ లో అనేక ఆర్థిక నేరాలకు పాల్పడిన అమిత్‌ షా ఈ రోజు దేశానికి హోం మంత్రి అని, ప్రధాని మోదీపైనా నేరారోపణలు ఉన్నాయన్నారు. ఇలాంటి వారి పాలనలో దేశం ఏమైపోతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. హక్కుల కోసం పోరాడుతున్న సాయిబాబా లాంటి వారు దేశ ద్రోహులైతే మహాత్మాగాంధీ, మార్టిన్‌ లూథర్‌కింగ్‌, నెల్సన్‌ మండేలా లాంటి వారు కూడా ద్రోహులేనా అని ప్రశ్నించారు. దేశ ప్రజలపై యుద్ధం చేస్తోన్న అమిత్‌ షా మావోయిస్టులపై 80 శాతం విజయం సాధించామని చెప్పుకొని భుజాలు తడుముకుంటున్నారని మండిపడ్డారు. తమకు ఎదురే లేదని విర్రవీగిన నియంతలే కాలగర్భంలో కలిసిపోయారన్న వాస్తవం మర్చిపోవద్దన్నారు. పాలకుల ఆగడాలకు అంతం పలకాలంటే ఎర్రజెండాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్‌ సాయిబాబా పోరాట స్ఫూర్తితో దండకారణ్యం నుంచి ఆదివాసీలను తరిమేసేందుకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్‌ కాగర్‌ కు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేయాలని సభలో తీర్మానించారు. సంస్మరణ సభలో పౌర హక్కుల సంఘం, నిర్బంధ వ్యతిరేక వేదిక, అమరుల బంధుమిత్రుల సంఘం, ప్రజాసంఘాల నాయకులు ప్రొఫెసర్ జి.లక్ష్మణ్, ఎం.రాఘవాచారి, పద్మకుమారి, మీనా కందస్వామి, ప్రొఫెసర్ హరగోపాల్, సాయిబాబా సహచరి వసంత, కూతురు, మంజీర తదితరులు పాల్గొన్నారు.

    Memorial Meet Prof GN Saibaba
    Previous Articleప్రధాని మోదీకి జగన్‌ దత్తపుత్రుడు : వైఎస్‌ షర్మిల
    Next Article హై కమిషనర్‌ను విచారణకు రావాలంది.. అందుకే వెనక్కి పిలిపించాం
    Naveen Kamera

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.