నార్సింగ్ పరిధిలో దారుణం జరిగింది. ఓ మహిళ హత్యకు గురైంది. ఆమెను హత్య చేసిన యువకుడు ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పుప్పాలగూడలో చోటుచేసుకున్నది. అనంత పద్మనాభస్వామి ఆలయం సమీపంలోని గుట్టల వద్ద ఇద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Add A Comment