రైతుభరోసా మార్గదర్శకాలు విడుదల
భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే సాయమని స్పష్టం
BY Raju Asari12 Jan 2025 9:51 AM IST

X
Raju Asari Updated On: 12 Jan 2025 9:51 AM IST
రైతుభరోసా మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఎకరాకు రూ. 12 వేలు రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నారు. భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనున్నది. భూవిస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు దీన్ని అందించనున్నారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా సాయం అందజేస్తారు. సాగు యోగ్యం కాని భూములను రైతుభరోసా నుంచి తొలిగించనున్నారు. ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. రైతు భరోసా ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగులో జారీ చేసింది
Next Story