ఈ ప్రకృతి విలయం వల్ల దేశంలో 41,500 కు పైగా భవనాలు ధ్వంసమయ్యాయని తుర్కియే ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. సహాయక చర్యలు కొనసాగిస్తున్న సిబ్బంది అడియమాన్ ప్రావిన్సులో ఒక 18 ఏళ్ల యువకుడిని, కహ్రామన్మారిస్లో మరో ఇద్దరిని మంగళవారం కాపాడారు.