తెలంగాణలో కొంతకాలంగా ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య కూడా కోల్డ్ వార్ నడుస్తోంది. బీజేపీకి రాజకీయంగా మేలు చేసేలా గవర్నర్ తమిళసై వ్యవహరిస్తున్నారన్నది అధికార పార్టీ ఆరోపణ. ఇటీవల గవర్నర్ ప్రసంగం కూడా లేకుండానే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించారు. ఈ గ్యాప్ ప్రభావం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లోనూ స్పష్టంగా కనిపించింది. గవర్నర్ తమిళసై రాజ్భవన్లో సాదాసీదాగా రాష్ట్ర ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అధికార యంత్రాంగం నుంచి కూడా ఎవరూ పెద్దగా హాజరుకాలేదు. ఈ సందర్బంగా ప్రసంగించిన గవర్నర్… […]