రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి క్రీడల్ని ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ఏ ఆటలో ప్రతిభ ఉన్నా, వారిని మరింత సానపట్టేందుకు ఏర్పాట్లు చేసింది. ఆ ఆటలో వారు మరింత రాటుదేలేలా శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ పోటీలకు పంపనుంది.