Sharmila

జగన్ ని ఉద్దేశపూర్వకంగానే ఇరుకున పెట్టాలని ఇరువర్గాలు భావించడం ఇక్కడ విశేషం. అటు టీడీపీ, ఇటు షర్మిల ఓ ప్లాన్ ప్రకారమే జగన్ పేరు ప్రస్తావించారని, వైసీపీని విమర్శించారని తెలుస్తోంది.

సిద్ధం సభల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వైసీపీ, పార్టీపరంగా కనీసం వైఎస్ఆర్ నివాళి సభ కూడా నిర్వహించలేదని మండిపడ్డారు షర్మిల. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద సభ ఏర్పాటు చేశామని, ఆయనకు ఘన నివాళులర్పించామని చెప్పుకొచ్చారు.