తిరుమల శ్రీవారి దర్శనానికి ఇటీవల గరిష్టంగా 48 గంటలు సమయం పట్టిందని భక్తులు కంగారుపడిపోయారు. ముందుగా ప్రయాణాలు పెట్టుకున్నవారు కూడా హడలిపోయారు. అలాంటిది ఇప్పుడు గంటన్నరలోపే శ్రీవారి సర్వదర్శనం పూర్తవుతుందని హామీ ఇస్తున్నారు ఈవో ధర్మారెడ్డి. అసలిది సాధ్యమయ్యేపనేనా..? కంపార్ట్ మెంట్లలో గంటలతరబడి వేచి చూడటాన్ని ఎలా నివారిస్తారు..? అసలేంటి టీటీడీ స్ట్రాటజీ..!! శ్రీవారి దర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. అయితే కొవిడ్ కారణంగా రెండేళ్లుగా పూర్తి స్థాయిలో దర్శనాలకు అవకాశం లేదు. టోకెన్ల […]