President

సిక్కిం గవర్నర్‌గా రాజస్థాన్‌ బీజేపీ సీనియర్‌ నాయకుడు ఓం ప్రకాశ్‌ మాథుర్‌ను నియమించింది. ప్రస్తుతం అక్కడ ఉన్న లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్యను అస్సాం గవర్నర్‌గా బదిలీ చేసింది.

క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఇండియా తరపున ప్రెసిడెంట్ ముర్ము లండన్ చేరుకున్నారు. లాంకస్టెర్ హౌస్‌కు వెళ్లిన ముర్ము.. అక్కడ రాణి సంస్మరణార్థం ఏర్పాటు చేసిన సంతాప సందేశాల పుస్తకంలో సంతకం చేశారు.

శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ప్రజల ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వదిలి పారిపోయిన తర్వాత ప్రస్తుతం ఆదేశం కొత్త‌ నాయకుడి కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో దేశాధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని రణీల్‌ విక్రమ సింఘే, విద్యాశాఖ మాజీ మంత్రి డల్లాస్‌ అలహప్పెరుమా, లెఫ్టిస్ట్‌ నేత అనురా దిస్సనాయకేలు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.

తెలంగాణలో త్రిముఖ పోరు బలంగా కనపడుతోంది, ఏమాత్రం అవకాశం దొరికినా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోడానికి మూడు పార్టీల నేతలు రెడీగా ఉంటారు. అదే సమయంలో ‘ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయి’ అనే ప్రచారం ఇక్కడ జోరుగా సాగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. కాదు కాదు కాంగ్రెస్, టీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందంతో ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తుంది. లేదు లేదు.. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ ఒకటే, కావాలంటే హుజూరాబాద్ బై ఎలక్షన్ చూడండి అంటూ […]

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పై మరో సారి హత్యాయత్నం జరిగినట్టు తెలుస్తోంది. అయితే దాన్నించి ఆయన తృటిలో తప్పించుకున్నాడు. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేస్తున్న సమయంలో ఈ హత్యాయత్నం జరగడం గమనార్హం. ఈ విషయాన్ని కూడా ఉక్రెయిన్ మిలటరీ అధికారే బైటపెట్టారు. నల్ల సముద్రం-కాస్పియన్‌ సీ మధ్య ఉన్న కాకసస్‌ ప్రాంతంలో పుతిన్‌పై దాడి జరిగిందని, ఆదాడి నుంచి ఆయన సురక్షితంగా బైటపడ్డాడని ఉక్రెయిన్‌ డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ కైర్య్లో బుడానోవ్ […]