దేశంలో ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యత పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రకృతి సాగు గణనీయంగా విస్తరిస్తోంది. 17 రాష్ట్రాల్లో 16 లక్షల 78 వేల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా ప్రకటించింది.