సమైక్య రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తొందరలోనే బీజేపీలో చేరబోతున్నారని సమాచారం. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. కిరణ్ బీజేపీలో చేరటంలో ఆశ్చర్యమేమీలేదు. కాకపోతే తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించబోతున్నారన్న ప్రచారమే చాలా ఆశ్చర్యంగా ఉంది.