చట్ట సభల్లో ఉన్న ఇద్దరు ప్రజా ప్రతినిధులు బహిరంగ వేదికలపై గార్ధభ సంవాదం చేసుకున్నారు. ఒక సభలో ఒకరు గాడిద అంటే, ఆ వెంటనే మరో సభలో మరొకరు నువ్వే గాడిద అంటూ బదులు తీర్చుకున్నారు. ఈ సంవాదం కోనసీమ జిల్లా మండపేటలో జరిగింది. మండపేట నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు.. రైతు పంటల బీమా కార్యక్రమంలో అధికార పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. రైతుల పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నా, రైతు సమస్యలు మాత్రం గాలికి వదిలేశారని, […]