KTR

పార్లమెంటులో , బైట తెలంగాణకు వ్యతిరేకంగా మోదీ మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలు మర్చిపోగలరా ? తల్లిని చంపి బిడ్డను బతికించారని మోదీ అన్న మాటలు తెలంగాణ ప్రజలకు గుర్తులేవా ? అప్రజాస్వామికంగా, పార్లమెంటు తలుపులు మూసి, బలవంతంగా విభజన బిల్లు పాస్ చేశారని మోదీ పార్లమెంటు సాక్షిగా చేసిన ప్రసంగం ఆయన మర్చిపోవచ్చేమో గానీ తెలంగాణ ప్రజల చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. అలాంటి తెలంగాణ వ్యతిరేకి మోదీ ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు. రెండు రోజులు […]

రాష్ట్రాలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్ని ప్రకటించింది కేంద్రం. భారత్ లో వ్యాపారం చేసుకోడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఏ రాష్ట్రం అనుకూలంగా ఉంటుందో మార్కులు ఇచ్చి మరీ ఓ క్లారిటీ ఇచ్చింది కేంద్రం. అయితే తెలంగాణ కేవలం పెట్టుబడులు పెట్టేందుకు కేవలం అనుకూలమైన రాష్ట్రమే కాదని, ప్రశాంతమైన వాతావరణం కూడా ఉన్న రాష్ట్రం అని చెబుతున్నారు కేటీఆర్. తమ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తోపాటు, పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి మారుపేరని […]

హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంది. ఊరూవాడా పోస్టర్లు వేస్తున్నారు, మోదీకోసం వంట వాళ్లకు అప్పుడే పని అప్పజెప్పారు, ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు. కానీ టీఆర్ఎస్ మైండ్ గేమ్ కి బీజేపీ విలవిల్లాడిపోయే పరిస్థితి వచ్చింది. సరిగ్గా కార్యవర్గ సమావేశాలకు రెండు రోజుల ముందు ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేనన్ని స్థానాలు కైవసం చేసుకున్నామని ఆ మధ్య సంబరాలు చేసుకున్న […]

ట్విట్టర్‌లో చాలా యాక్టీవ్‌గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్.. అప్పుడప్పుడూ బీజేపీ నాయకులు చేసే తప్పులను ఎండగట్టడంలో ముందుంటారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ అంశంపై మీడియాతో మాట్లాడుతూ మాట జారడం (టంగ్ స్లిప్)పై కేటీఆర్ చాలా వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. కొత్తగా పలు వస్తువులు, సేవలపై జీఎస్టీ విధించారు. వాటిని సీతారామన్ ప్రెస్ మీట్‌లో వివరించారు. బెట్టింగ్, గ్యాంబ్లింగ్, క్యాసినోలు, హార్స్ రేసింగ్‌పై […]

తెలంగాణకు కేంద్రం ఎక్కువ నిధులు ఇచ్చిందా? తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి ఎక్కువ నిధులు వెళ్లాయా..? అనే విషయంపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. కేంద్రానికి తెలంగాణ ఇచ్చినదానికంటే.. తెలంగాణకు కేంద్రం ఎక్కువ ఇచ్చినట్టు నిరూపించగలిగితే తాను మంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికెళ్తానంటూ ఛాలెంజ్ చేశారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. ఢిల్లీ వేదికగా బీజేపీకి సవాల్ విసిరారు. రాష్ట్రపతి అభ్యర్థి సొంత […]

తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తే ప్రముఖులనుంచి కచ్చితంగా మంచి స్పందన ఉంటుంది. కాకపోతే ఆయా రంగాలకు చెందినవారు వాటిపై స్పందిస్తుంటారు. కానీ ఇప్పుడు సినీ నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు.. ఒకరేంటి.. అందరూ కేటీఆర్ ట్వీట్ పై సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. టీహబ్-2 ప్రారంభోత్సవంపై కేటీఆర్ చేసిన ట్వీట్ దీనికి కారణం. ఈనెల 28న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా టీహబ్-2 ప్రారంభోత్సవం ఉంటుందని కేటీఆర్ ట్వీట్ చేయగా.. ప్రముఖులంతా శుభాకాంక్షలు […]

జహీరాబాద్ లో ఉన్న మహీంద్రా ట్రాక్ట్రర్ తయారీ కంపెనీ 3,00,001 ట్రాక్టర్లను తయారు చేసిన సందర్భంగా మూడు లక్షల ఒకటో ట్రాక్ట్రర్ ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పరిశ్రమలు & వాణిజ్య శాఖల మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు & వాణిజ్యం మరియు ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, పార్లమెంటు సభ్యులు పాటిల్. ఎమ్మెల్యే మాణిక్ రావు, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ […]

ఇటీవల కేంద్ర ప్రభుత్వ పరిధిలో 10లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మోదీకి ధన్యవాదాలు చెబుతూనే ఆయన్ని నమ్మలేమంటూ చురకలంటించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ప్రతిపక్ష పార్టీలు, నిరుద్యోగ యువత నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేకే ఆయన ఈ ప్రకటన చేశారని చెప్పారు కేటీఆర్. ఎనిమిదేళ్లలో ఏం చేశారు..? గడచిన ఎనిమిదేళ్లలో ఉద్యోగాల భర్తీ విషయంలో మోదీ అసలు ఏం చేశారని ప్రశ్నించారు కేటీఆర్. ఇప్పటి వరకూ ఉద్యోగాల […]

బాసరలోని ఆర్జేయూకేటీలో విద్యార్థుల ఆందోళనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయన ట్వీట్ చేసిన వెంటనే అధికార యంత్రాంగం సమస్య పరిష్కారానికి అడుగులు వేసింది. బాసరలోని ఆర్జేయూకేటీలో సమస్యలపై స్పందించాలంటూ బత్తిని తేజగౌడ్ అనే విద్యార్థి మంత్రి కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనికి బదులిచ్చిన కేటీఆర్.. సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తున్నట్టు భరోసా ఇచ్చారు. సమస్యల పరిష్కారంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులు ఆందోళన […]

జూన్ 12, 2022 ఆదివారం సాయంత్రం బెంగుళూరుకు చెందిన ఒక కంపెనీ రూ. 24,000 కోట్ల భారీ పెట్టుబడితో దేశంలోనే మొట్టమొదటి డిస్‌ప్లే FAB Unit ను తెలంగాణలో ఏర్పాటు చేయనుంది అన్న వార్త సంచలనం సృష్టించింది. మొత్తం రాష్ట్ర బడ్జెట్ 2,50,000 కోట్లు అయినప్పుడు, 24,000 వేల కోట్ల పెట్టుబడి ప్రకటన కచ్చితంగా సెన్సేషనల్ న్యూసే అవుతుంది. అందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. తెలంగాణలో భారీ పెట్టుబడి పెడుతున్న “Rajesh Exports” ఒక మల్టీనేషనల్ […]