బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రాష్ట్రంలో 18 యేండ్ల తరువాత జరిగాయి. కానీ అప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు ఎంతో తేడా ఉందని రాష్ట్రంలో తాము అధికారంలోకి రాబోతున్నామని, ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో ఉపయోగపడతాయని లేని పోనీ హడావిడి సృష్టించి, లేని పోనీ భ్రమలను కల్పించి ఇక్కడి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది బీజేపీ.
#jumlakingmodi
సోషల్ మీడియాని వాడుకోవడంలో మోదీ కింగ్ అని బీజేపీ నేతల అభిప్రాయం. రెండు దఫాలు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడానికి.. సోషల్ మీడియాను బీజేపీ సమర్థంగా వినియోగించుకోవడం కూడా ఓ కారణం అంటారు. కానీ మోదీకే సోషల్ మీడియా విషయంలో షాకిచ్చాయి టీఆర్ఎస్ శ్రేణులు. సోషల్ మీడియా కింగ్ ని కాస్తా.. అదే సోషల్ మీడియాలో జుమ్లా కింగ్ అంటూ ర్యాగింగ్ చేసి వదిలిపెట్టాయి. #jumlakingmodi సోషల్ మీడియాలో ఆదివారం ట్రెండింగ్ లో ఉన్న హ్యాష్ ట్యాగ్ […]