joining Congress

పీజేఆర్‌ కుమార్తె, టీఆర్‌ఎస్ కార్పొరేటర్‌ విజయారెడ్డి పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిచర్చలు జరిపారు. అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా ప్రకటించారు. తన తండ్రి సీఎల్‌పీ లీడర్‌గా పనిచేశారని, కాంగ్రెస్‌లో ఉంటూనే మరణించారని, ఆయన ఆశయాల మేరకు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో సోనియా గాంధీ నాయకత్వంలో నడవాలని నిర్ణయించుకున్నట్టుగా ఆమె చెప్పారు. పార్టీలో చేరాలన్న ఉద్దేశంతో చర్చలు జరిపేందుకు వచ్చానన్నారు. టీఆర్ఎస్‌లో పరిస్థితులు బాగోలేవన్నారు. […]