jaganmohan reddy

అమరావతి విషయంలో జగన్‌మోహన్ రెడ్డి వైఖరి మార్చుకుని, రాజధాని నిర్మాణం కొనసాగించాలన్న ప్రొఫెసర్ హరగోపాల్, కోదండరాం సూచనలపై వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌ తీవ్రంగా స్పందించారు. గతంలో చంద్రబాబు ల్యాండ్ పూలింగ్‌ను వ్యతిరేకించిన హరగోపాల్ ఇప్పుడు పిలవగానే పేరంటానికి వచ్చినట్టుగా వచ్చి అమరావతివాదులకు మద్దతు ఇస్తున్నారని సురేష్ విమర్శించారు. అసలు ఎందుకు వెళ్తున్నాం అన్న ఆలోచన కూడా లేకుండా వీరు పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చారంటూ ఘాటు విమర్శలు చేశారు.అమరావతి 900 రోజుల కార్యక్రమంలో వీళ్లంతా భాగస్వామ్యులుగా మారి […]