అమరావతికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన త్రిసభ్య ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ సత్యనారాయణమూర్తి పదవి విరమణ చేసి వెళ్తున్న సమయంలో అమరావతివాదులు పూల వర్షం కురిపించారు. రోడ్లుకు ఇరువైపుల నిలబడి ఘనంగా వీడ్కోలు పలికారు. వారికి జస్టిస్ సత్యనారాయణమూర్తి అభివాదం చేశారు. గతంలో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు కఠినమైన తీర్పులు ఇచ్చిన జస్టిస్ రాకేష్ కుమార్ రిటైర్ అయి వెళ్తున్న సమయంలోనూ అమరావతివాదులు ఇదే తరహాలో పూల వర్షం కురిపిస్తూ వీడ్కోలు పలికారు. జస్టిస్ సత్యనారాయణ మూర్తి […]