దమ్ముంటే తన మీద కేసులు పెట్టాలని ఇంజినీర్లు, చిన్నా చితకా కార్మికులపై కాదంటూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ప్రజల సౌకర్యంకోసం ఐడీపీఎల్ దగ్గర రోడ్డు వేస్తుంటే కేసులు పెట్టాలని కేంద్రమంత్రి ఆదేశాలిస్తున్నారు అని కేటీర్ మండిపడ్డారు. మంచి చేయరు చేస్తున్నవాళ్ళను అడ్డుకుంటారని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఆ కేంద్రమంత్రికి చేతనైతే కంటోన్మెంట్ తో సహా హైదరాబాద్ నుండి కరీంనగర్, రామగుండం, ఆదిలాబాద్ వెళ్లే మార్గంలో రక్షణ రంగానికి […]