ఏడాదికేడాది వేసవి మరింత వేడిగా మారిపోతోంది. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల స్పష్టంగా తెలుస్తోంది. వేడిగాలులతో జనం అల్లాడిపోతున్నారు. దీనికి కారణం ఎవరు..? చేజేతులా పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్న ప్రజలే వాతావరణ మార్పులకి కారణం. పర్యావరణ హితమైన నిర్ణయాలు తీసుకోలేని, తీసుకున్నా రాజకీయ స్వలాభాలకోసం అమలు చేయలేని పాలకులే దీనికి కారణం. ప్రపంచ దేశాల సంగతి పక్కనపెడితే.. భారత్ లో కూడా ఏడాదికేడాది వాతావరణంలో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. ఉత్తర భారతంలో వర్షపాతం తగ్గిపోతోంది, దక్షిణ భారతం తుపాన్లు, వరదల్లో […]