ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ విద్యావ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ‘నాడు -నేడు’ కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలు మార్చారు. అంతేకాక ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా ఇంగ్లిష్ మాధ్యమాన్ని తీసుకొచ్చారు. దీంతో సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యార్థుల కోసం అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, గోరుముద్ద లాంటి అనేక పథకాలు అమలు చేస్తున్నారు. సీఎం జగన్ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్య అందుతుండటంతో అంతా సంతోషిస్తున్నారు. […]