రండి.. ఇప్పుడే తేల్చుకుందామంటూ టీడీపీ, బీజేపీ నేతలకు ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సవాల్ చేశారు. ధర్మవరంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ప్లీనరీలో మాట్లాడిన ఎమ్మెల్యే.. తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణను ఉద్దేశించి వెంకట్రామిరెడ్డి సవాల్ చేశారు. ”అధికారంలోకి వస్తే అక్రమాలను తేలుస్తా అంటున్నావ్.. ఎప్పుడు వస్తావ్, రంగంలోకి ఎప్పుడు దిగుతావో చెప్పు.. కాళ్లు చేతులు విరుస్తామని […]