విశాఖ రుషికొండ విధ్వంసం కేసు సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెప్పిందని.. ఆ వివరాలను సుప్రీంకోర్టుకు అందజేస్తానని ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. విశాఖ సముద్ర తీరానికి అనుకుని ఉన్న రుషికొండ వద్ద.. గతంలో టూరిజం శాఖకు చెందిన కొన్ని నిర్మాణాలు ఉండేవి. వాటిని కూడా అక్కడ ప్రకృతికి విఘాతం కలగకుండా చిన్నచిన్నగా నిర్మాణాలు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. ఇప్పటికే ఉన్న టూరిజం కట్టడాలను మరింత అభివృద్ధి చేస్తామంటూ ప్రకటించింది. […]