coronavirus

జంతువుల నుంచి మనుషులకు కరోనా సోకుతుందా ..? దీనిపై అనేకమంది పరిశోధనలు చేశారు. సార్స్-కోవ్-2 గా వ్యవహరించే వైరస్ కోవిడ్-19 కి కారణమవుతుందని మొదట నిర్ధారించినప్పటికీ.. ఈ వైరస్ మనుషులకు, జంతువులకు మధ్య వ్యాప్తి చెందుతుందా అన్నదానిపై ఇప్పటికీ రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ప్రజలు ప్రేమగా పెంచుకునే కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులకు.. వారి నుంచి ఇది సోకుతుందని, ముఖ్యంగా కోవిడ్ తీవ్రంగా ఉన్న రోగులు వీటితో క్లోజ్ కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు ఈ వైరస్ […]

కరోనా వైరస్ వేరియంట్లు మరోసారి వేగంగా వ్యాపిస్తుండటం, తెలంగాణ రాష్ట్రంలో కేసుల సంఖ్య కూడా పెరుగుతుండటంతో ప్రభుత్వం మరోసారి వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికీ రెండు డోసులు పూర్తి కాని వారి కోసం ఇయ్యాల్టి నుంచి జులై చివరి వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సారి వ్యాక్సిన్ వేసుకోనివారిని హెల్త్ వర్కర్లే ఇంటింటికీ తిరిగి గుర్తించి వారికి టీకాలు వేయనున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ జరగలేదు. దీంతో ప్రతీ గ్రామానికి రెండు […]

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు. కోట్లాది మంది అత్యవసర చికిత్స అవసరమై ఆసుపత్రుల్లో ఉండిపోయారు. ఐసీయూల్లో వెంటిలేటర్లపై ఉండి తమ ప్రాణాలను రక్షించుకున్నారు. ఈ క్రమంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఎన్నో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా చికిత్స సమయంలో వెంటిలేటర్లపై ఉండి ప్రాణాలను రక్షించుకున్న చాలా మంది ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ఊపిరితిత్తుల పనితీరు దారుణంగా మారుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో, […]

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంత అల్లకల్లోలం సృష్టించిందో మరిచిపోలేం. అయితే అనారోగ్యాలు, మరణాలే కాదు లక్షలాది మందిని పేదరికంలోకి తోసింది. వందల మందిని బిలయనీర్లను చేసింది. ఆక్స్‌ఫామ్ ఇంట‌ర్నేష‌న‌ల్ రిలీజ్ చేసిన నూతన‌ స‌ర్వే రిపోర్ట్ లో సంచలన విషయాలను వెల్లడించింది. కరోనా కాలంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తి 30 గంట‌ల‌కు ఒక కొత్త బిలియ‌నీర్ పుట్టుకవ‌చ్చిన‌ట్లు ఆక్స్‌ఫామ్ త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది. ఈ కాలంలో 573 మంది కొత్త బిలియనీర్లు తయారయ్యారని నివేదిక తెలిపింది.అలాగే […]