ఒక్కోసారి రాష్ట్ర ప్రభుత్వాలకు, అక్కడి గవర్నర్లకు మధ్య పొసగకపోవడం, ఒకరి విధానాలు మరొకరికి నచ్చకపోవడంతో సయోధ్య కొరవడి వివాదాలు తలెత్తుతుండడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా తెలుగు ప్రాంతానికి వచ్చిన మహిళా గవర్నర్లు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కుముద్ బెన్ జోషి గవర్నర్ గా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత చిన్న రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు 2019 `సెప్టెంబర్ లో నియమితులైన తమిళి సై సౌందరరాజన్ ప్రస్తుతం గవర్నర్ గా కొనసాగుతున్నారు. తొలినాళ్ళలో […]