Congress

రాముడు, హనుమంతుడు అనే కాన్సెప్ట్ సహజంగా బీజేపీ నేతలు ఓన్ చేసుకుంటారు. కానీ కాంగ్రెస్ లో కూడా రాముడు, హనుమంతుడు ఉన్నారని చెబుతున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ రాముడైతే.. తాను హనుమంతుడి లాంటివాడినని చెప్పారు. రామాయణంలో రాముడికి హనుమంతుడు అండగా ఉన్నట్టు.. తాను రాహుల్ గాంధీకి ఎప్పుడూ అండగా ఉంటానని అన్నారు. మీరంతా వానర సైన్యం అంటూ కాంగ్రెస్ శ్రేణుల్ని ఉద్దేశించి చెప్పారు. రావణాసురుడిని చంపడం కోసం ఎంత దూరమైనా వెళ్తామని అన్నారు […]

తెలంగాణలో ఇంటర్నల్‌ పాలిటిక్స్‌ వేడెక్కాయి. బీజేపీ సభలతో హడావుడి పెంచితే..కాంగ్రెస్‌ కండువాల మార్పిడితో దూకుడుగా వెళుతోంది. కండువాల మార్పిడిలో కమలం వెనుకపడింది. దీంతో ఇప్పుడు ఆ పార్టీ చేరికలపై ఫోకస్‌ పెట్టింది. తెలంగాణలో కమలం నేతల హడావుడి పెరిగింది. కానీ ఆ పార్టీ వైపు చూసే నేతలు కనపడడం లేదు. ఈటల రాజేందర్ తర్వాత టీఆర్‌ఎస్‌ నుంచి భారీగా వలసలు ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ నాంపల్లి బీజేపీ ఆఫీస్‌ వైపు ఎవరూ అడుగులు వేయలేదు. జిట్టా […]

పశ్చిమబెంగాల్ లో గతంలో జీరోగా ఉన్న బీజేపీ.. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంలా మారిందని, ఆ రాష్ట్రంలో వామపక్షాలు, కాంగ్రెస్ ని లేకుండా చేశారని.. తెలంగాణలో కూడా అదే వ్యూహంతో ముందుకెళ్తున్నారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కాంగ్రెస్ పెద్దలను కలిసి తెలంగాణ తాజా పరిస్థితి వివరించారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనని, బెంగాల్ లాగే ఇక్కడ కూడా కాంగ్రెస్ ని లేకుండా చేయాలని వారు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. అది […]

అదేంటి.. కేసీఆర్ ని మోదీ విమర్శించకపోవడం వల్ల బీజేపీ శ్రేణులు నిరాశపడ్డాయంటే అందులో అర్థముంది, మధ్యలో కాంగ్రెస్ కి ఏమొచ్చింది అనుకుంటున్నారా..? ఇది నిజం, మోదీ ప్రసంగంలో టీఆర్ఎస్ ని, ముఖ్యంగా కేసీఆర్ ని పల్లెత్తు మాట అనకపోవడంతో కాంగ్రెస్ హర్ట్ అయింది. ఒకరకంగా కాంగ్రెస్ రెండు వ్యూహాలను ముందుగానే సిద్ధం చేసుకుంది. ఒకవేళ మోదీ విమర్శలు సంధిస్తే.. టీఆర్ఎస్ అవినీతి జాతీయ స్థాయిలో తెలిసిపోయింది, అందుకే ఈ విమర్శలంటూ కేసీఆర్ సర్కారుని ఇరుకునపెట్టేవారు కాంగ్రెస్ నేతలు. […]

కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక కంచుకోట లాంటిది. కానీ, ఇప్పుడు మాత్రం ముఖ్య నాయకులంతా వేరే పార్టీల్లోకి వెళ్లిపోయారు. వైఎస్ఆర్ సీపీ ఏర్పడిన తర్వాత ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఎదగడంతో.. వీళ్లంతా కారెక్కారు. అయితే రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాక.. మళ్లీ ఖమ్మంలో కాంగ్రెస్ తన ఉనికిని చాటుకుంటోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి బలమైన […]

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో వలసల హడావిడి మొదలైంది. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన చాలా మంది నాయకులు తిరిగి సొంత గూటికి చేరాలని భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉన్న ఈ నాయకులు కారు దిగి.. గాంధీభవన్ బాట పట్టనున్నారు. ఆరుగురు కార్పొరేటర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. బడంగ్‌పేట్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత టీఆర్ఎస్ పార్టీని వీడనున్నారు. భర్త నర్సింహారెడ్డితో కలసి ఆమె […]

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన కాంగ్రెస్ లో చిచ్చు రేపింది. టీఆరెస్ ఆహ్వానం మేరకు హైదరాబాద్ వచ్చిన యశ్వంత్ ను కాంగ్రెస్ నాయకులెవ్వరూ కలవొద్దని రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన అక్కడితో ఆగలేదు. పార్టీ ఆదేశాలకు విరుద్దంగా ఎవరైనా వెళ్తే గోడకేసి కొడ్తా అని రెచ్చ గొట్టే విధంగా మాట్లాడారు. దాంతో ఆ పార్టీలో గొడవలు మొదలయ్యాయి. ఒక వైపు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీ. హన్మంతరావు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి లు […]

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈ రోజు హైదరాబాద్ వచ్చారు. ఆయనకు టీఆరెస్ భారీగా స్వాగతం పలికింది. ఆయన టీఆరెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ఎం ఐ ఎం ఏంపీ, ఎమ్మెల్యేలను కూడా కలవబోతున్నారు. అయితే యశ్వంత్ సిన్హాకు ప్రధాన మద్దతుదారైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు మాత్రం ఆయనను కలవడానికి నిరాకరించారు. ఈ వ్యవ‌హారమే ఆ పార్టీలో గొడవ‌కు దారి తీసింది. యశ్వంత్ సిన్హాను టీఆరెస్ ఆహ్వానించినందున తాము ఆయనను కలవబోమని పీసీసీ అధ్యక్షుడు […]

తెలంగాణ కాంగ్రెస్ లో ఇటీవల చేరికల జోష్ పెరిగింది. ఇతర పార్టీలనుంచి వచ్చే వలస నేతలకు కండువాలు కప్పేస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంబరపడిపోతున్నారు. ఎన్నికలకింకా ఏడాదే టైమ్ ఉన్న ఈ సందర్భంలో ఈ చేరికలతో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని అంచనా వేస్తున్నారు. చేరికల సంగతేమో కానీ.. కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఎవరికి వారే యమునా తీరే.. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం అగ్నిపథ్ వ్యతిరేక నిరసనలకు పిలుపునిచ్చింది. అంతకు ముందు రైతు […]

కాంగ్రెస్‌ పార్టీ అంటేనే గ్రూపు రాజ‌కీయాల‌కు కేరాఫ్ అని అందరికీ తెలిసిందే. అధికారంలో లేనప్పుడు ఈ వర్గపోరు మరింతగా ముదిరిపోతుంది. ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడం మా పార్టీ సిద్ధాంతం అన్న‌ట్టుగా చెప్పుకుంటుంటారు. 8 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో లేని కాంగ్రెస్.. ఏపీలో పూర్తిగా కనుమరుగవగా.. తెలంగాణలో మాత్రం కాస్త బలంగానే క‌న‌బ‌డుతోంది. కానీ, ఈ పార్టీకి సరైన నాయకుడు లేక కార్యకర్తల్లో ఆందోళన నెలకొన్న సమయంలో టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టారు. ఇక […]