ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న బాధితులను మోసం చేసిన వ్యవహారంపై ఆరా తీస్తున్న సీఐడీ అధికారులు
CID
మార్గదర్శిలో కోటి రూపాయలకు పైగా డిపాజిట్లు చేసిన వాళ్ళందరికీ సీఐడీ నోటీసులు జారీచేసింది. విచారణకు రావాలని సమయం, తేదీ, ప్లేస్తో సహా నోటీసుల్లో స్పష్టంగా చెప్పింది. అయితే తమ ఖాతాదారులకు సీఐడీ నోటీసులు ఇవ్వటాన్ని ఛైర్మన్ రామోజీరావు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
మార్గదర్శికి చెందిన రూ.242 కోట్ల పెట్టుబడులను గురువారం జప్తు చేసింది. ప్రజల నుండి డిపాజిట్లు సేకరిస్తున్న మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు, ఎండీ, కోడలు శైలజ తమిష్టం వచ్చినట్లుగా చిట్టేతర సంస్థలకు దారి మళ్ళిస్తున్నట్లు సీఐడీ ఆధారాలతో సహా బయటపెట్టింది.