జాబిల్లి ఉపరితలంపై చంద్రయాన్-3 ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. అయితే, చంద్రుడి దక్షిణ ధ్రువానికి సంబంధించి సమాచారాన్ని సేకరిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ కు ఓ ప్రమాదం ఎదురయ్యింది. అయితే ఇస్రో అప్రమత్తం చేయడంతో రోవర్ సేఫ్ గా బయటపడింది.
Chandrayaan-3
చంద్రుడి దక్షిణ ధృవానికి చేరుకుని ప్రపంచంలో ఏ దేశం సాధించలేని ఘనత ఇస్రో సాధించింది. తక్కువ ఖర్చుతో రకరకాల ప్రాజెక్టులను సక్సెస్ చేస్తూ.. అంతరిక్ష పరిశోధనల్లో శరవేగంగా దూసుకుపోతోంది.
చంద్రయాన్-3 ఆగస్టు 23 సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తుందని ఇప్పటికే ఇస్రో ప్రకటించింది.
అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టనుంది.
జూలై 14న చంద్రయాన్-3 రాకెట్ను ప్రయోగించనున్నట్టు తెలిపింది. ఇది చంద్రుడిపై రోవర్ను దించేందుకు భారత్ చేస్తున్న మూడో ప్రయత్నం కావడం గమనార్హం.