CBI

ముడా స్కామ్ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలనే డిమాండ్ వస్తున్న నైపథ్యంలో సిద్దరామయ్య సర్కారు కర్ణాటకలో సీబీఐ దర్యాప్తును నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ముఖ్యమంత్రి హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు శ్రీవారికి పవిత్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్డీయేలో ప్రధాన భాగస్వామి అయిన బీజేపీ.. తమ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలను ఎలా వాడుకుంటుందో కొన్నాళ్లుగా దేశంలోని ప్రజలందరూ చూస్తున్నారు. అదే సమయంలో తమ పార్టీకి చెందిన వారిపై ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా.. వారిపై కనీస విచారణ కూడా చేయడం లేదు.

ఏపీలో 20 మంది తెలుగుదేశం పార్టీ నాయకులపై సీబీఐ, ఈడీ దాడులు తప్పవని వార్తలు వస్తున్నాయి. పలు ఆర్థిక నేరాలకు పాల్పడినందుకు త్వరలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ దాడులు చేయబోతున్నాయి. టీడీపీ సీనియర్‌ నేత, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు తాజాగా నిర్వహించిన సోదాలు ప్రారంభం మాత్రమేనని ఓ వర్గం మీడియాలో వార్తలు వస్తున్నాయి. “20 మంది టీడీపీ నేతల జాబితా సిద్ధంగా ఉంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ […]

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. బుధవారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది ఆమంచిపై అభియోగం. ఇదివరకే ఒకసారి ఆమంచిని సీబీఐ విచారించింది. ఇప్పుడు మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. డాక్టర్‌ సుధాకర్ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించిన సమయంలో ఆమంచి కృష్ణమోహన్‌ కోర్టు తీర్పుపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. సుధాకర్‌ కేసును సీబీఐకి అప్పగించడంతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. […]