నైజీరియాలో ఉగ్రవాదులు మళ్ళీ తెగబడ్డారు. ఓ చర్చిపై దాడి చేసి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 50 మందికి పైగా మరణించగా అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఒండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాథలిక్ చర్చిలో ఈ దారుణం జరిగింది ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున పెంతెకోస్ట్ ఆరాధకులు చర్చికి వచ్చారు. ఆ సమయంలో చర్చిలోకి తుపాకులతో ప్రవేశించిన ముష్కరులు జనంపైకి కాల్పులు జరిపారు. దాంతో 50 మంది అక్కడికక్కడే కుప్పకూలి పోయారు. […]