2022 ఆసియాకప్ హాకీ టోర్నీలో భారత్ కంచుమోత మోగించింది. ఇండోనీసియా రాజధాని జకార్తావేదికగా జరిగిన సమరంలో యువఆటగాళ్లతో కూడిన భారతజట్టు బరిలో నిలిచింది. గత ఆసియాకప్ టోర్నీలో బంగారు పతకం సాధించిన భారత జట్టును ప్రస్తుత టోర్నీలో మాత్రం దురదృష్టం వెంటాడింది. గ్రూప్ లీగ్ ఆఖరి పోటీలో ఆతిథ్య ఇండోనీసియాను 16-0 గోల్స్ తో చిత్తు చేయడం ద్వారా మెడల్ రౌండ్లో అడుగుపెట్టిన భారత కుర్రాళ్లు సూపర్ -4 రౌండ్లో స్ఫూర్తిదాయకమైన ఆటతీరును ప్రదర్శించారు. ఓ గెలుపు, […]