ఆకుపచ్చ జెండాలు, పసుపు రంగు దుస్తులు ధరించిన నిరసనకారులుల పార్లమెంటును ఆక్రమించారు. సుప్రీం కోర్ట్, అధ్యక్ష భవనాల్లోకి చొచ్చుకెళ్ళి లోపల విధ్వంస సృష్టించారు. నిరసన కారులు అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్మీ జోక్యం చేసుకోవాలని కోరుతూ బ్యానర్లు ప్రదర్శించారు.